జాతియం
కోవిడ్ కలకలం.. దేశవ్యాప్తంగా 1,000కి పైగా యాక్టివ్ కేసులు

దేశంలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా వేయికి పైగా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళతోపాటు తమిళనాడు రాష్ట్రాల్లోనే కోవిడ్ కేసుల పెరుగుదల కన్పిస్తోంది. అదేవిధంగా ఏపీలో నాలుగు, తెలంగాణలో ఒకరికి పాజిటివ్ నిర్ధారణ అయింది. క్యాన్సర్ రోగులు, వృద్ధులు గర్భిణీలను అప్రమత్తంగా ఉండాలని ICMR సూచనలు చేసింది. ముఖ్యంగా ప్రతీ ఒక్కరూ సోషల్ డిస్టెన్స్, శానిటైజేషన్, మాస్క్ ధరించాలంటూ వైద్యులు చెబుతున్నారు.