తెలంగాణ

Telangana: నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

Telangana: నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. యువతకు ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకం ప్రవేశ పెడుతున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సంక్షేమ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతకు ఈ స్కీం కింద 3లక్షల నుంచి 5లక్షల వరకు సాయం చేస్తామని తెలిపారు.

6వేల కోట్లతో ఈ స్కీం రూపొందించామని 5 లక్షల మందికి తగ్గకుండా సాయం చేస్తామని ఆయన చెప్పారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు ఈ స్కీం కింద దరఖాస్తులు స్వీకరిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. అనంతరం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అర్హులకు శాంక్షన్ లెటర్స్ అందజేస్తామని చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button