తెలంగాణ
Telangana: నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

Telangana: నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. యువతకు ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకం ప్రవేశ పెడుతున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సంక్షేమ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతకు ఈ స్కీం కింద 3లక్షల నుంచి 5లక్షల వరకు సాయం చేస్తామని తెలిపారు.
6వేల కోట్లతో ఈ స్కీం రూపొందించామని 5 లక్షల మందికి తగ్గకుండా సాయం చేస్తామని ఆయన చెప్పారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు ఈ స్కీం కింద దరఖాస్తులు స్వీకరిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. అనంతరం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అర్హులకు శాంక్షన్ లెటర్స్ అందజేస్తామని చెప్పారు.