ఆంధ్ర ప్రదేశ్

AP Liquor Scam: ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్‌రెడ్డి ఆరోపణలను ఖండించిన సిట్

AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్‌రెడ్డి ఆరోపణలను సిట్ ఖండించింది. లిక్కర్ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామని సిట్ తెలిపింది. కేసీరెడ్డి నుంచి చెవిరెడ్డికి భారీగా ముడుపులు అందినట్లు తేలిందని సిట్ వెల్లడించింది. ఈ నగదును ఎన్నికల వేళ ప్రజలకు పంచినట్లు తెలిసిందన్నారు. చెవిరెడ్డి వ్యక్తిగత గన్‌మెన్ మదన్‌రెడ్డిని విచారణకు పిలిచామన్నారు. కానిస్టేబుల్ మదన్‌రెడ్డి విచారణకు సహకరించలేదని సిట్ తెలిపింది.

కానిస్టేబుల్ మదన్‌రెడ్డి మా పేర్లు రాసిచనిపోతానని అధికారులనే బెదిరించాడని సిట్ ఆరోపించింది. లిక్కర్ స్కామ్‌ను పారదర్శకంగా విచారిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 200 మందికి నోటీసులిచ్చి విచారించామన్నారు. మధన్‌రెడ్డి ఆరోపణలు పూర్తిగా అవాస్తమని సిట్ తెలిపింది. ఈ కేసుపై డీజీపీ ఒక సీనియర్ అధికారితో ఉన్నత స్థాయి విచారణ చేయించమని రిక్వెస్ట్ చేశామన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button