ఆంధ్ర ప్రదేశ్
కాకినాడ జిల్లా కాట్రావులపల్లిలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో తడిసిన ధాన్యాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రైతులు అధైర్యపడొద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. తక్కువ ధరకు కొనుగోలు చేసే దళారులను ప్రోత్సహించకండని అన్నారు.
గత ప్రభుత్వం రబీలో 25 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే కూటమి ప్రభుత్వం ఈ రబీలో 59 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిందన్నారు. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.