Shashta Graha Kutami 2025: 6 గ్రహాలు కలిస్తే విపత్తు తప్పదా?

Shashta Graha Kutami 2025: షష్ట గ్రహ కూటమి ఇప్పుడు తెలుగు నేలపై ఒక కొత్త ప్రచారం. ఆ గ్రహ కూటమి అలా అంటగా, ఇలా అంటగా అంటూ ఎవరికి నోటికి వచ్చింది వాళ్లు, ఎవరికి తోచిన సిద్ధాంతాలను వారు మాబాగా ప్రచారం చేసేస్తున్నారు. ఇక వారికి బాలేదు. వీరికి బాలేదు. అలా లేదు. ఇలా లేదు అంటూ ఇక ప్రచారం మొదలుపెట్టేశారు. ఏమో అసలే ఇబ్బందులు, కొత్త ఇబ్బందులొస్తాయోమోనని చాలా మంది పూజులు, పునస్కరాలంటూ లక్షలు వృధా చేసుకుంటున్నారన్న ప్రచారం ఉంది.
వాస్తవానికి తాజాగా రాబోతున్న షష్టగ్రహ కూటమితో అసలేం జరుగుతుందన్నదానిపై అనేక అనుమానాలు, సంశయాలు ఉన్నాయ్. త్వరలో రాబోతున్న షష్ట గ్రహ కూటమి వ్యక్తుల మీద ప్రభావం చూపుతుందని, పలానా రాసుల వారు ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండాలని, అలా ఉండాలని, ఇలా ఉండాలని ఎవరికి తోచిన విధంగా వారు జోస్యాలు చెబుతుంటే సామాన్యుడు ముక్కున వేలేసుకుంటున్నాడు. అన్నీ గ్రహల చేతిలో ఉంటే తమకు అనుగ్రహం ఎందుకు కలగడం లేదని ప్రశ్నిస్తున్నారు.
షష్ట గ్రహ కుటమి ఈనెల 29న అంటే ఉగాదికి ఒక రోజు ముందు వస్తుంది. షష్టగ్రహ కూటమి ప్రభావం 29కి ముందే అంటే 28 రాత్రి నుంచే ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. షష్ట గ్రహ కుటమి ఒక నిర్దిష్ట రాశిలో ఆరు గ్రహాలు రావడం వల్ల ఏర్పడుతుంది. రవి, బుధుడు, శుక్రుడు, చంద్రుడు, శని, రాహువు… షష్టగ్రహ కూటమి మీన రాశిలో ఏర్పడుతుంది. దీంతో ఏదో విపత్తు జరుగుతుందని వాళ్లకు మంచిదని, వీళ్లకు మంచిదని ఇలా అనేక మంది అనేక విషయాలు చెబుతున్నారు.
జ్యోతిషశాస్త్ర అంచనాల ప్రకారం ఒకే కక్షలోకి 6 రాసులు రావడం అరిష్టమని కొందరు చెబుతున్నారు. ఒకే కక్షలోకి అన్ని గ్రహాలు రావడంతో సానుకూలత కంటే ప్రతికూల అధికమని కొందరు చెబుతుంటే ఇవన్నీ నాన్సెన్స్ అంటున్నారు హైతువాదులు. ఒకే కక్షలోకి ఆరు గ్రహాలు రావడం సైన్స్ అద్భుతమని, దీని వల్ల ప్రపంచానికి మేలు జరుగుతుందంటున్నారు.
ఐతే ఇలా షష్ట గ్రహ కూటమి వల్ల సదరు వ్యక్తికి, ఆ వ్యక్తి పేరుతో ఉన్న సంస్థకు గ్రహాలు అనుకూలంగా ఉంటే ఒకలా, లేకుంటే మరోలా అంటూ ఎవరికి తోచిన విధంగా వారు కథలు చెబుతున్నారని కూడా కొందరు విమర్శిస్తున్నారు. కష్టకాలంలోనూ శ్రమపడిన వారికి విజయం దక్కుతుందని, ఆలశ్యం కావొచ్చేమో గానీ, విజయం మాత్రం పక్కా అంటున్నారు.
సవాళ్లు, సంఘర్షణలనేవి ప్రతి ఒక్కరిని పలకరిస్తూనే ఉంటాయని వాటన్నింటినీ అధిగమించినప్పుడే విజయాలు నమోదవుతాయంటారు. గ్రహాలు వ్యక్తిగత జన్మ నక్షత్రాన్ని బట్టి ఆయా రాశులపైనా ప్రభావం చూపించొచ్చని, వేర్వేరు కలయికల కారణంగా వేర్వేరు భిన్న ఫలితాలు ఇస్తాయన్న అంచనాలను కొందరు కొట్టిపారేస్తున్నారు. భావోద్వేగాలతో ఆటలాడుకోవద్దన్న వర్షన్ కూడా కొందరు విన్పిస్తున్నారు.
నాడు ఏర్పడిన షష్ట గ్రహ కూటమి వేరు.. నేడు ఏర్పడుతుంది వేరు. ప్రకృతి వైపరీత్యాలు జరిగే అవకాశం ఉంది కానీ ఇంకేదే అవుతుందన్నది ట్రాష్ అంటున్నారు. గురుడు, కుజుడు, కేతువు బయట ఉండటం వల్ల పెద్ద ప్రమాదాలు ఏమీ జరగవంటున్నారు. మూడు పాప గ్రహాలు కలిశాయంటున్నారు. శని, రాహువు, రవి పాపగ్రహాలు మూడు గ్రహాలు కలయిక ఇబ్బందిపెడుతున్నాయ్. వాళ్లతో కలిసి బుధుడు.. శుభ గ్రహాలతో ఉంటే శుభాలు, అశుభ గ్రహాల్లో ఉంటే అశుభం కలిగిస్తాడు.
వృషభంలో గురుడు, మిథనంలో కుజుడు, కన్యా రాశిలో కేతువు ఉండటం వల్ల పెద్దగా అరిష్టాలేవీ లేవంటున్నారు. శుక్రుడు,చంద్రుడు శుభ గ్రహాలుగా భావిస్తారు. ఐతే, రాజకీయ సంఘటనలు, సాంస్కృతిక మార్పులు వంటి సామాజిక ధోరణులపై గ్రహాల ప్రభావం ఉంటుందంటే కొంత నమ్మొచ్చని.. వ్యక్తులపై ప్రభావం అసలంటే అసలే ఉండదంటున్నారు. ఉదాహరణకు, అనుకూలమైన గ్రహాల అమరికతో ఆ రాసుల వారందరి జీవితాలు బాగుపడవని కూడా కుండబద్ధలుకొడుతున్నారు. అలాగని ప్రతికూలత ఉన్నవారికి వచ్చే నష్టం కూడా ఏమీ లేదంటున్నారు.