జాతియం
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

Corona Virus: దేశంలో రోజురోజుకు కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త రూపంలో కోవిడ్ పంజా విసురుతుండటంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అత్యధికంగా కేరళలో 273 మందికి కరోనా పాజిటివ్ తేలింది. ముంబైలో ఈ నెలలోనే 95 కేసులు రికార్డయ్యాయి. ఇక ఢిల్లీలో 24 గంటల్లో 23 కరోనా కేసులు నమోదయ్యాయి.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను, కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది. వాస్తవానికి ఏపీ, తెలంగాణలోనూ రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. దీంతో రేవంత్ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇందులో భాగంగా గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక కరోనా వార్డులు ఏర్పాటు చేసింది. ప్రత్యేక వార్డుల్లో 60 పడకలు ఏర్పాటు చేసింది సిబ్బంది.