తెలంగాణ
Ponguleti Srinivasa Reddy: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

Ponguleti Srinivasa Reddy: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 37 కోట్ల యాభై లక్షలతో నిర్మించనున్న వంద పడకల ఆసుపత్రి భవనాలకు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా భూ భారతి పోర్టల్ గురించి మాట్లాడిన మంత్రి పొంగులేటి ధరణి పోర్టల్ తప్పుల తడక అని ఎద్దేవా చేశారు. ధరణి ముసుగులో రైతుబంధు ద్వారా ప్రజాధనాన్ని బడా బాబులు లూటీ చేశారన్నారు. ధరణి లొసుగుల వల్ల రాష్ట్రంలో 9 లక్షల 26 వేలమంది రైతన్నలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు.