తెలంగాణ

Karnataka: కర్ణాటక తుంగభద్ర నదిలో మునిగి డాక్టర్‌ మృతి

Karnataka: సరదాగా విహారయాత్రకు వెళ్లిన వైద్యుల బృందంలో విషాదం చోటుచేసుకుంది. తుంగభద్రలో దూకి ఈత కొట్టే క్రమంలో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ అనన్యరావు మృతి చెందారు. నదిలో నుంచి రెస్క్యూ టీమ్‌ ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో, కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మిత్రులతో కలిసి డాక్టర్‌ అనన్యరావు హంపీ టూర్‌కి వచ్చారు.

ఈత కొట్టడానికి తుంగభద్ర నదికి వెళ్లారు. నదిలో అనన్య ఈత కొడుతుండగా ఒక్కసారిగా ఉద్దృతి పెరగడంతో కొట్టుకుపోయింది. ఈ క్రమంలో అనన్య కాపాడేందుకు స్నేహితులు ప్రయత్నించారు. కానీ, వారి ప్రయత్నం ఫలించలేదు. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని గుర్తించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button