తెలంగాణ
Thummala: తెలుగు రాష్ట్రాలపై కేంద్రం వివక్షతను చూపిస్తుంది

Thummala: కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలపై వివక్షతను చూపిస్తుందని విమర్శించారు మంత్రి తుమ్మల. ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ను మంత్రి సందర్శించారు. రాజీవ్ కెనాల్ ద్వారా సాగర్ కెనాల్కు వదులుతున్న గోదావరి జలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నీటి ఎద్దడి రాకుండా రైతుల కోసం గోదావరి జలాలను వదులుతున్నామన్నారు.
సీతమ్మ బ్యారేజ్కి సిడబ్ల్యుసి పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపిస్తుందన్నారు. రైల్వే నీటి వనరుల పంపిణీలో తీవ్ర అన్యాయం చేస్తుందని విమర్శలు చేశారు.