తెలంగాణ

Revanth Reddy: జానారెడ్డి ఇంటికి సీఎం రేవంత్‌ రెడ్డి

Revanth Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. జానారెడ్డి ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ పలు అంశాలపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఆపరేషన్ కగార్, మావోయిస్టులు కోరిన శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. కాగా ఇదే అంశంపై నిన్న సీఎం రేవంత్‌తో పీస్ కమిటీ చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ జానారెడ్డి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తుంది. అదేవిధంగా కాల్పుల విరమణ, శాంతిచర్చల అంశంపై జానారెడ్డి సలహాలు తీసుకుంటానన్నారు సీఎం రేవంత్.

2005లో జరిగిన శాంతి చర్చల అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు జరిగిన పరిణామాలు రేవంత్‌కు వివరిస్తున్నారు జానారెడ్డి. ఈ నేపథ్యంలోనే కేంద్రానికి లేఖ రాసే ఆలోచనలో రేవంత్ ప్రభుత్వం ఉన్నట్లు టాక్ వినబడుతోంది. ముఖ్యంగా శాంతిభద్రతల సమస్యల అంశంగా కాకుండా సామాజిక కోణంలో చూస్తామంటున్నారు సీఎం రేవంత్. ప్రధానంగా గతంలో చర్చల్లో పాల్గొన్నవారితో సర్కార్ సంప్రదింపులు చేపట్టింది.

మరోవైపు నిన్న బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఆపరేషన్ కగార్‌పై బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కగార్ పేరుతో గిరిజనులను ఊచకోత కోస్తున్నారంటూ నిప్పులు చెరి గారు. ఆపరేషన్ కగార్ ఆపి, నక్సలైట్లతో చర్చలు జరపాలని సూచనలు చేశారు. దీనిపై పార్టీ తరపున కేంద్రానికి లేఖ రాస్తామన్నారు కేసీఆర్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button