తెలంగాణ
Hyderabad: నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ

Hyderabad: హైదరాబాద్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టిన.. గొలుసు దొంగతనాలు ఆగడం లేదు. తాజాగా నార్సింగి పీఎస్ పరిధిలోని అల్కాపురి టౌన్షిప్ సమీపంలోని స్పోర్ట్స్ పార్క్ సమీపంలో చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు.
మహిళ మెడలోని గొలుసును లాక్కెళ్లారు. గోల్డ్ చైన్ బలంగా లాగడంతో మహిళ కిందపడిపోయింది. మహిళకు తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.