తెలంగాణ

జై తెలంగాణ నినాదాలతో దద్దరిల్లిన డల్లాస్

బీఆర్ఎస్ నేతలకు స్పూర్తి గులాబీ కార్యకర్తల ఆశాజ్యోతి. కేసీఆర్ రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న కల్వకుంట్ల వారసుడు. ప్రత్యర్ధులకు సింహ స్వప్నంగా మారిన రాజకీయ యోధుడు తారకరాముడు అమెరికా వేదిక పెట్టిన పొలికేకకు డల్లాస్ దద్దరిల్లింది. విదేశీ గడ్డలోని ఎన్నారైలందరూ లక్షలాదిగా తరలివచ్చి, జైతెలంగాణ అంటూ నినదించడమే కాదు. కేటీఆర్ నాయకత్వానికి కూడా జైకొట్టడాన్ని చూస్తే మళ్లీ తెలంగాణ ఉద్యమం గుర్తొచ్చింది.

బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలతో పాటు, తెలంగాణ రాష్ట్ర అవతరణను పురస్కరించుకుని డల్లాస్‌లో కేటీఆర్ పాల్గొన్న ఆత్మీయ సభ లక్షలాది మంది ఎన్నారైలతో కిటకిట లాడింది. డల్లాస్‌లోని పెప్పర్ ఎరీనా వేదికగా నిర్వహించిన ఈ రజతోత్సవ సంబురాలకు వచ్చిన జనాన్ని చూసిన అమెరికన్లు హౌడీ మోడీ సభను మించి పోయే విధంగా ఎన్నారైలు తరలి వచ్చారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ తొలిసారి అధికారంలోకి వచ్చాక, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం తరపున పెట్టుబడులను ఆహ్వానించడం కోసం 2015లో డల్లాస్‌కు వెళ్లిన కేటీఆర్‌‍కు ఏ రకమైన స్వాగతం లభించిందో దానికి పదిరెట్లు జనాభా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు హాజరై కేసీఆర్ వారసుడికి ఘన స్వాగతం పలికారు. అధికారంలో ఉన్నప్పుడు లభించిన ఆదరణ కంటే, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న కేటీఆర్‌పై తెలంగాణ ప్రజల్లోనే కాకుండా విదేశాల్లోని ఎన్నారైలకు విశ్వాసం పెరిగిందని గులాబీ నాయకులు విశ్లేషిస్తున్నారు. ఈ రజతోత్సవ వేడుక సభకు హాజరైన అమెరికాలోని తెలంగాణ వాసుల స్పందనను చూస్తుంటే కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్‌కు ఆమోదం లభించినట్లేనని పొలిటికల్ అనలిస్ట్‌లు అంచనా వేస్తున్నారు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైలు పోషించిన పాత్ర మరువలేనిది. ఉద్యమ సమయంలో అమెరికాలోని ఎన్నారైలు ఆర్ధికంగా అందించిన సాయం ఎన్నటికీ మరువలేనిదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలు సందర్భాల్లో కొనియాడారు. ఉద్యమ సమయంలో అమెరికా ఎన్నారైలలో కనిపించిన ఉత్సాహం, మళ్లీ కేటీఆర్ పాల్గొన్న బీఆర్ఎస్ రజతోత్సవ సభల్లో కనిపించడం శుభ పరిణామమని గులాబీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సభ ఇంత విజయవంతం అవడం వెనుక కేటీఆర్ చాలా రోజులుగా చేసిన శ్రమ ఉందని కూడా బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. వరంగల్‌లో నిర్వహించిన రజతోత్సవ వేడుకల్లో చాలా కాలం తర్వాత కేసీఆర్ పాల్గొంటున్న కారణంగా ఆయన ప్రసంగాన్ని వినేందుకు లక్షలాది మంది గులాబీ కార్యకర్తలు తరలి వచ్చారని విశ్లేషణలు జరిగాయి. కానీ డల్లాస్‌లో కేటీఆర్ పాల్గొన్న సభకు మోదీ సభను మించి పోయే రీతిలో ఎన్నారైల అటెండెన్స్ ఉందంటే ఇది వన్ పూర్తిగా తారక రాముడి వన్ మ్యాన్ షో అని అందరూ అంగీకరించక తప్పదు.

అధికారంలో ఉన్న మంత్రి కంటే తన మాటలను వినాలనే ఆసక్తితో తరలి వచ్చిన అమెరికా ఎన్నారైలను ఏ మాత్రం నిరాశ పరచకుండా కేటీఆర్ తన వాగ్ధాటితో బీఆర్ఎస్ రజతోత్సవ సభను రక్తి కట్టించారు.
60 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసేందుకు కేసీఆర్ పడ్డ శ్రమను ఫోకస్ చేస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన కేటీఆర్ ఉద్యమ కాలంలో కేసీఆర్‌తో పాటూ బీఆర్ఎస్ నేతలుగా తాము ఎదుర్కొన్న ఒడిదుడుకులను కళ్లకు కట్టినట్లు వివరించారు.

దీంతో మళ్లీ తెలంగాణ ఉద్యమ ఫ్లాష్ బ్యాక్ అందరి కళ్లలో కదిలాడింది. అవమానాలను తట్టుకుని, విమర్శలకు కుంగి పోకుండా ఉద్యమ స్ఫూర్తితో కేసీఆర్ ముందుకెళ్లడం వల్లే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగామని మహాత్మా గాంధీలా కేసీఆర్ పేరు కూడా చిరస్ధాయిగా నిలిచి పోతుందని కేటీఆర్ గుర్తు చేశారు. రాష్ట్ర సాధనతో తమ పని పూర్తయిందని అనుకోకుండా దేశంలోని అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు ధీటుగా తెలంగాణను తీర్చిదిద్ది, పదేళ్లలో సంక్షేమంతో పాటూ అభివృద్ధిలోనూ తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని కేటీఆర్ చెబుతున్నప్పుడు సభాప్రాంగణం చప్పట్లతో మారుమోగింది.

దీంతో కేటీఆర్ మరింత ఉత్సాహంతో తన ప్రసంగాన్ని కొనసాగించారు. పేదరిక నిర్మూలనతో పాటూ తలసరి ఆదాయాన్ని పెంచే విషయంలోనూ కేసీఆర్ అనుసరించిన విధానాలతో దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శింగా నిలిచిందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ సాధించిన అభివృద్ధిని చూసి, సినీ సూపర్ స్టార్ రజినీకాంత్ హైదరాబాద్ లో ఉంటే న్యూయార్క్ లో ఉన్న అనుభూతి కలిగిందని ప్రశంసించిన విషయాన్ని కేటీఆర్ ఈ సభలో ప్రస్తావించారు.

కేవలం ఆర్ధిక పరంగానే కాకుండా రైతుల సంక్షేమానికి కూడా అధికారంలో ఉన్నంత కాలం కేసీఆర్ ప్రాధాన్యమిచ్చారని, లక్షలాది ఎకరాలకు సాగు నీరివ్వాలనే ఉద్దేశంతోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామని కేటీఆర్ వివరించారు. కానీ ఈ ప్రాజెక్టును నిర్వీర్యం చేయాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేయడం సరికాదని కేటీఆర్ కామెంట్ చేసినపుడు సభలోని జనం ఆయనకు మద్దతు పలకడం గమనార్హం.

కేసీఆర్ పాలనలో సాధించిన ప్రగతిని వివరించి, బీఆర్ఎస్ రజతోత్సవ సభను ముగించకుండా, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తెలంగాణ సంక్షేమమే తమ ధ్యేయమనే సందేశాన్నిచ్చేందుకు కేటీఆర్ మొగ్గు చూపడం కొసమెరుపు. అధికారంలో ఉన్నా, లేకపోయినా తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామని హామీ ఇచ్చిన కేటీఆర్, అమెరికాలోని ఎన్నారైలకు దిశా నిర్దేశం చేశారు.

మారుతున్న కాలానికి, సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఎన్నారైల మైండ్ సెట్ కూడా మారాలని, పరిస్ధితులకు అనుగుణంగా సర్దుకుపోయే మనస్తత్వం రావాలని పోటీ తత్వం పెరగాలని కేటీఆర్ సూచించారు. అమెరికాలోని ఎన్నారైలు పెట్టుబడులతో ముందుకు వచ్చి, జన్మభుమి, కన్నతల్లి తెలంగాణ రుణం తీర్చుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

తాము అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో పెట్టుబడుల కోసం ఇచ్చిన పిలుపుపై సానుకూలంగా స్పందించిన ఎన్నారై సంస్థలకు ఈ సందర్భంగా కేటీఆర్ ధన్యావాదాలు తెలిపారు. ఈ సందర్భంగా భారతదేశంలో ప్రపంచీకరణకు ఆద్యుడు పీవీ నరసింహారావు అంటూ కాంగ్రెస్‌కు చెందిన మాజీ ప్రధానిని కేటీఆర్ అభినందించడం ద్వారా అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా తమ ఆలోచన ఉంటుందని కేటీఆర్ మెసేజ్ ఇచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button