Earthquake: ప్రకాశం జిల్లా ముండ్లమూరులో మరోసారి భూప్రకంపనలు

Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు భయాందోళనలకు గురిచేశాయి. జిల్లాలోని రేపాయి, ముండ్లమూరు మండలంలోని గ్రామాల్లో సెకన్ పాటు భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.గత నెల ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో గత నెల 21,22వ తేదీల్లో వరుసగా రెండురోజులు కొన్ని క్షణాలపాటు భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనకు లోనయ్యారు. ముండ్లమూరు, శింగన్నపాలెం, వేంపాటు, పెద్దఉల్లగల్లు, పసుపుగల్లు గ్రామాల్లో భూమి కంపించిందని స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
తాజాగా మరోసారి ఇదే మండలంలోని పలు గ్రామాల్లో భూమి కంపించడం ఆందోళనకు గురి చేస్తుందని గ్రామస్థులు తెలిపారు. ముండ్లమూరుకు దగ్గరగా ఉన్న గుండ్లకమ్మ నదిలో అంతర్లీనంగా జరుగుతున్న మార్పుల వల్లే వరుస భూకంపాలకు కారణంగా శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ప్రస్తుతం వస్తున్న భూప్రకంపనలన్నీ తక్కువ స్ధాయివి కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.