సినిమా
Nag Ashwin: తిరుమల శ్రీవారి సేవలో దర్శకుడు నాగ్ అశ్విన్

Nag Ashwin: తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో కలసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరిగిందన్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. రాబోయే నెక్స్ట్ మూవీ కల్కి-2 అని.. అయితే కల్కి-2 రావడానికి ఇంకా చాలా సమయం పడుతుందని చెప్పారు నాగ్ అశ్విన్.