తెలంగాణ
Falcon Scam: ఫాల్కన్ స్కామ్పై ఈడీ కేసు నమోదు

Falcon Scam: ఫాల్కన్ స్కాంపై ఈడీ కేసు నమోదు చేసింది. ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసి దర్యాప్తు ఆరంభించింది. అధిక లాభాలు ఆశ చూపి సుమారు 17 వందల కోట్లు వసూలు చేసింది ఫాల్కన్ సంస్థ. అందులో 850 కోట్ల వరకు మోసం చేసినట్లు సైబరాబాద్ ఆర్థికనేరాల విభాగం ఇప్పటికే గుర్తించింది.
ఈ కేసులో 19 మందిపై కేసులు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులైన ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అమర్దీప్కుమార్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్యన్సింగ్, సీఈవో యోగేందర్సింగ్ దుబాయ్ పారిపోయినట్లు గుర్తించారు. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసుల్లోని వివరాల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది.