తెలంగాణ
Komatireddy: నల్గొండ జిల్లాను కరువు నేలగా మార్చిన ఘనత కేసీఆర్దే

Komatireddy: నల్గొండ జిల్లాలో రైతుల పేరిట సభ నిర్వహించే అర్హత కేటీఆర్కు లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. నల్గొండ జిల్లాను కరువు నేలగా మార్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పనులు మొదలుపెట్టామని తెలిపారు.