తెలంగాణ
Revanth Reddy: బీఆర్ఎస్ వారిలా చీకట్లో ఎవరి కాళ్లు పట్టుకోలేదు

Revanth Reddy: అసెంబ్లీలో ఢిల్లీ పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 15 నెలల్లో 32 సార్లు ఢిల్లీ వెళ్లానని మూడు సార్లు దేశ ప్రధానిని కలిశానన్నారు. మరో 300 సార్లు అయినా వెళ్తానంటు చెప్పుకొచ్చారు. అయితే తాను బీఆర్ఎస్ వారిలా చీకట్లో ఎవరి కాళ్లు పట్టుకోలేదన్నారు.
దేశ ప్రధాని ఏ రాష్ట్రానికైనా పెద్దన్నేనని కేంద్రంతో సత్సంబంధాలు ఉండాలని తెలిపారు. అనంతరం దేశ ప్రధానిని గౌరవించే సంస్కారం తనకుందంటూ సీఎం రేవంత్ పేర్కొన్నారు.