Srisailam: శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ

Srisailam: శ్రీశైల మల్లన్న స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వరుసగా సెలవుల రావడం, విద్యా సంస్థలు ప్రారంభం కానుండడంతో స్వామి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకునేందుకు భారీగా తరలివచ్చారు. దర్శన కంపార్టుమెంట్లలో భక్తులు బారులు తీరారు. భక్తులకు త్వరగా దర్శనమయ్యేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక భక్తులు రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాల్లో అర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలుపివేశారు.
సామాన్య భక్తులకు ఉచిత, శీఘ్ర దర్శనానికి భారీగా పెరిగిన భక్తులు రద్దీగా, మరోపక్క ఆన్లైన్లో 500 రూపాయల స్పర్శ దర్శనానికి టికెట్ బుక్ చేసుకున్న వారికి మూడు విడతలుగా ఉదయం 7:30 కు మధ్యాహ్నం 2.30 రాత్రి 9 గంటలకు స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్న అధికారులు,భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో శ్రీనివాసరావు,అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దర్శనార్థమై క్యూలైన్లు,కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు పాలు, అల్పాహారం,బిస్కెట్స్ మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో శ్రీనివాస రావు తెలిపారు.