తెలంగాణ
Bandi Sanjay: చీపురుతో ఆప్ను ఊడ్చేశారు

Bandi Sanjay: ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై బండి సంజయ్ స్పందించారు. ఢిల్లీ ప్రజలు చీపిరితో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య పాలనను ఢిల్లీ ప్రజలు కోరుతున్నారన్నారు. అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలు వారికి వద్దని భావించారని విమర్శించారు.
ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందు నుంచీ ఊహించిందేనన్నారు. మేధావి వర్గం అంతా బీజేపీకి ఓటు వేశారని చెప్పారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ విజయం సాధిస్తామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.