తెలంగాణ

Telangana: రేషన్ కార్డుదారులకు అదిరిపోయే శుభవార్త

Telangana: తెలంగాణ రేషన్ కార్డుదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బియ్యంతో పాటు నిత్యవసర సరుకులు ఇకపై పూర్తి స్థాయిలో అందిస్తామని ప్రకటించారు. రేషాన్ షాపుల్లో ఇకనుంచి రేషన్ బియ్యం తో పాటు నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తామని వివరించారు. లబ్ధిదారులు ఇకపైన రేషన్ షాపుల్లో నిత్యవసర సరుకులు తీసుకువెళ్లాలని కోరారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం కూడా పంపిణీ చేయబోతున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో 22 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. గతంలో బియ్యం పంపిణీలో చాలా లోపాలున్నాయన్నారు. ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ మొదలవుతుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా కూడా వారికి అందుబాటులో ఉన్న రేషన్ షాప్ లో బియ్యం తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్టు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button