తెలంగాణ
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. ప్రణీత్ రావుకు బెయిల్ మంజూరు

Phone Tapping Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావుకు బెయిల్ మంజూరు అయ్యింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి సెషన్స్ కోర్టు. లక్ష రూపాలతో పాటు రెండు పూచికత్తులు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.
అలాగే పోలీసుల విచారణకు సహకరించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఏఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు, టాస్క్ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ రావు బెయిల్పై విడుదలయ్యారు.