ఆంధ్ర ప్రదేశ్
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిసిన మంత్రి లోకేష్

Nara Lokesh: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను.. ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించబోయే అఖిల భారత విద్యా మంత్రుల సమ్మేళనంను.. ఏపీలో ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలని లోకేష్ కోరారు.
పూర్వోదయ పథకం కింద 5వేల 684 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఏపీలో ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కాంక్లేవ్ కు అవకాశం కల్పించాలని, పీఎం శ్రీ పథకంలో మరో వెయ్యి 514 పాఠశాలలకు అవకాశం ఇవ్వాలని కోరారు.