తెలంగాణ
Mallanna Jathara: అగ్నిగుండాలతో ముగిసిన కొమురవెల్లి మల్లన్న జాతర

Mallanna Jathara: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెళ్లి మల్లికార్జున స్వామి వారి బ్రహోత్సవాలు ముగిశాయి. మూడు నెలల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన అగ్నిగుండాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు.
అగ్నిగుండాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అగ్ని గుండాల కార్యక్రమంతో మల్లన్న మహా జాతర ముగిసింది.