తెలంగాణ
KTR: SLBCలో ప్రమాదంపై మాజీమంత్రి కేటీఆర్ ట్వీట్

KTR: SLBCలో జరిగిన ప్రమాదంపై మాజీమంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రమాదం జరుగుతుందని ముందే హెచ్చరించారని గుర్తుచేశారు. నివేదికలు హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని కేటీఆర్ మండిపడ్డారు.
నివేదిక ప్రకారం రెండో ప్రాంతంలోనే ప్రమాదం జరిగిందన్న కేటీఆర్ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని, రెడ్జోన్గా ప్రకటిస్తూ నివేదికలు వచ్చాయని వివరించారు. కేవలం కమీషన్ల కోసమే పనులు నిర్వహించారని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇక SLBC టన్నెల్ ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు.