తెలంగాణ
Bandi Sanjay: రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర-రాష్ట్ర వాటాపై చర్చకు సిద్దమా?

Bandi Sanjay: రేవంత్ సర్కార్ తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ నిప్పులు చెరిగారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు డ్యూటీలో మినహాయింపు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి.. అయ్యప్ప, భవానీ, హనుమాన్ భక్తులకు డ్యూటీ మినహాయింపు ఎందుకివ్వరంటూ క్వశ్చన్స్ చేశారు. వారి చేసిన పాపమేంటని ప్రభుత్వాన్ని నిలదీశారు.
అసలు కాంగ్రెస్ నేతల్లో హిందూ రక్తం ప్రవహిస్తుందా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడంపై ప్రశ్నిస్తుంటే మతతత్వ ముద్ర వేస్తారా? అంటూ మండి పడ్డారు. ఇక రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర-రాష్ట్ర వాటాపై చర్చకు సిద్దమా? అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు.