తెలంగాణ
నేడు ఖైరతాబాద్ గణేషుడికి తొలిపూజ

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి నెలకొంది. వాడవాడలో గణనాథుడి విగ్రహాలు వెలిశాయి. భాగ్యనగరంలోని ఖైరతాబాద్ గణేషుడి తొలి పూజ జరగనుంది. ఉదయం 10గంటలకు ఖైరతాబాద్ గణనాథుడి ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. తొలి పూజకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరుకానున్నారు. ఖైరతాబాద్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.



