తెలంగాణ
అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీజేపీ మహిళా మోర్చా

తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ మహిళా మోర్చా అసెంబ్లీ ముట్టడికి యత్నించింది. మహిళా మోర్చా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళాలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీజేపీ మహిళా మోర్చా కార్యకరత్లు ముట్టడికి యత్నించారు. మహిళలకు ఇస్తామన్న 2500, తులం బంగారం, స్కూటీ హామీలు అమలు చేయాలని మహిళా మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. మహిళా మోర్చా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.