తెలంగాణ
Kishan Reddy: సీఎం రేవంత్కు కేంద్రమంత్రి కిషన్రెడ్డి లేఖ

Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి లేఖ రాశారు. గచ్చిబౌలిలో 400ఎకరాల భూమి వేలం ఆపాలని లేఖలో పేర్కొన్నారు. గతంలో భూముల విక్రయాలను రేవంత్ వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేశారు కిషన్రెడ్డి. ఈ 400 ఎకరాల భూమికి ఆనుకుని జీవవైవిధ్యానికి నెలవైన అనేక వృక్షజాలం, జంతుజాలం, సరస్సులు ఉన్నాయంటూ కిషన్ రెడ్డి వివరించారు.
734 వృక్ష జాతులు, 220 పక్షి జాతులతో సహా నెమళ్లు, వలస పక్షులు, మచ్చల జింకలు ఉన్నాయన్నారు కిషన్ రెడ్డి. అలాగే నగరానికి ఊపిరిని అందించే ఆక్సిజన్ వనరుగా ఉందని అందుకే భవిష్యత్ తరాల కోసం ఈ స్థలాలను రక్షించాలని లేఖలో పేర్కొన్నారు కిషన్రెడ్డి.