తెలంగాణ
Hyderabad: ఫోటోషూట్కి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన స్టూడెంట్

Hyderabad: ఫోటోషూట్కి వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు ఓ స్టూడెంట్. క్వారీ గుంతలో పడి ఇంటర్ విద్యార్థి మృతిచెందిన ఘటన హైదరాబాద్ జవహార్ నగరలో వెలుగులోకి వచ్చింది. సెలవురోజు కావడంతో ఆరుగురు స్నేహితులు విహారయాత్రకు వెళ్లారు. ఇందులో ఐదుగురు విద్యార్థులు నీటి నుంచి బయటపడగా మరొకరు క్వారీ గుంతలో పడి చనిపోయాడు. మృతుడ్ని తరుణ్ గా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.