ఆంధ్ర ప్రదేశ్
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు

Vallabhaneni Vamsi: సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు వ్యవహారంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి నిరాశే ఎదురైంది. వంశీకి మరోసారి రిమాండ్ను పొడిగిస్తూ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఎప్రిల్ 8న విచారణలో భాగంగా న్యాయమూర్తి వంశీకి ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది.
అయితే నేటితో రిమాండ్ ముగుస్తుండటంతో వంశీ కస్టడీని మరోసారి పొడిగించాలంటూ.. పోలీసుల తరఫు న్యాయవాది కోర్టులో తమ వాదనలను బలంగా వినిపించారు. దీంతో వల్లభనేని వంశీతో పాటు మరో నలుగురు నిందితులకు మే 6 వరకు రిమాండ్ను పొడిగిస్తున్నట్లుగా కోర్టు పేర్కొంది.