తెలంగాణ
Jajula Srinivas Goud: దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలి

Jajula Srinivas Goud: దేశ వ్యాప్తంగా కులగనణన చేపట్టాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీల చలో ఢిల్లీ,బీసీల పోరుగర్జన మహా ధర్నాకు వెళఉతున్న ప్రత్యేక రైలును జెండా ఊపి ప్రారంభించారు జాతీయ బీసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్బంగా కేంద్రప్రభుత్వం పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదింప చేయాలని డిమాండ్ చేసారు.
లేని పక్షంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఏప్రిల్ రెండవ తారీకు జరిగే సభ ట్రైలర్ మాత్రమేనని, మున్ముందు సినిమా చూపెడుతామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.