తెలంగాణ

తెలంగాణలో మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు

Telangana: మహిళలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని మహిళా సంఘాలకు ఉపాధి కల్పనలో భాగంగా ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర పంచాయతీ రాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి విభాగం ఈ ఉత్తర్వులు విడుదల చేసింది.

మొదటి విడతలో 150 మండల సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్దె బస్సులు ఇవ్వనుంది. ఆ తర్వాత మిగిలిన మండల సమాఖ్యలకు 450 ఆర్టీసీ అద్దె బస్సులు కొనుగోలు చేయనున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి నెల ఒక్కో బస్సుకు 77వేల 220 రూపాయల అద్దె ఆర్టీసీ చెల్లించనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button