తెలంగాణ
Mancherial: రోడ్డెక్కిన రైతులు.. రేపల్లెవాడ హైవేపై ఆందోళన

Mancherial: మంచిర్యాల జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. రేపల్లెవాడలోని మహేశ్వరి జిన్నింగ్ మిల్లు ఎదుట రైతుల ఆందోళన చేశారు. హైవేపై రాస్తారోకో చేశారు. పాసు బుక్లు ఉన్నా.. తమ పత్తిని మిల్లు యజమానులు.. కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. దళారులు తీసుకొచ్చిన పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. మహేశ్వరి మిల్లు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.