Stock Market: భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు

Stock Market: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువులపై 25 శాతం అదనపు సుంకం విధించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. రష్యా నుంచి భారతదేశం చమురు దిగుమతులు కొనసాగిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మొత్తం టారిఫ్ 50 శాతానికి చేరింది.
ఈ ప్రభావంతో ముఖ్యంగా వస్త్రాలు, సముద్ర ఉత్పత్తులు, తోలు వంటి ఎగుమతి రంగాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. భారతదేశం ఈ చర్యను అన్యాయం, అసంబద్ధం అని ఖండించింది. రష్యా చమురు దిగుమతుల కారణంగా అమెరికా నుంచి 50 శాతం టారిఫ్ ఎదుర్కొంటున్న దేశాల్లో బ్రెజిల్ తర్వాత భారతదేశం రెండోది.
ఉదయం ట్రేడింగ్లో 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్400 పైగా పాయింట్లు పడిపోయి 80వేలు వద్ద, 50 షేర్ల ఎన్ఎస్ఈ నిఫ్టీ 140 పాయింట్లు తగ్గి 24 వేల 400 వద్ద ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్లోని అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎటర్నల్, టాటా స్టీల్, ఎన్టీపీసీ వంటి సంస్థలు నష్టాల్లో ఉన్నాయి. ట్రెంట్, టైటాన్, సన్ ఫార్మా, ఐటీసీ వంటి షేర్లు లాభాలను నమోదు చేశాయి. ఆసియా మార్కెట్లలో మాత్రం దక్షిణ కొరియా కొస్పి, జపాన్ నిక్కీ 225, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్, హాంకాంగ్ హ్యాంగ్ సెంగ్ సూచీలు సానుకూలంగా కొనసాగాయి.



