ఆంధ్ర ప్రదేశ్
Vijayasai Reddy: విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు

Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి మంగళగిరి సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని విజయసాయి రెడ్డిని ఆదేశించారు. నోటీసుల్లో 506, 384, 420, 109, 467, 120(B) రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్లను సీఐడీ అధికారులు ప్రస్తావించారు.
మాజీ ఎంపీకి సీఐడీ ఎస్పీ నోటీసులు అందించినట్లు తెలుస్తోంది. హైదారాబాద్కు చెందిన కొందరు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణకు రావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.