ఆంధ్ర ప్రదేశ్
AP Inter Exams: ఏపీ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు

AP Inter Exams: ఏపీ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు తొలగించాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి ఏపీలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను తొలగించనున్నట్లు బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు.
తాము కేవలం సెకండ్ ఇయర్ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తామని స్పష్టం చేసారు. పరీక్షల ఎత్తివేతకు సంబంధించి ఈనెల 26 వరకు విద్యార్థులు, తల్లిదండ్రుల సలహాలు, సూచనలు నిర్వహిస్తామని తెలిపారు.