జాతియం

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌.. రేపు అఖిలపక్ష సమావేశం

Operation Sindoor: రేపు అఖిలపక్షం భేటీ కానుంది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. సమావేశం అనంతరం ఆపరేషన్ సింధూర్ గురించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు వివరించనున్నారు ప్రధాని మోదీ.

మరోవైపు కాసేపట్లో CWC సమావేశం ప్రారంభంకానుంది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది కాంగ్రెస్.

కొద్దిసేపటి క్రితమే ప్రారంభమయిన భద్రతా వ్యవహారాల కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. ప్రధాని మోదీ నివాసంలో ఈ సమావేశం కొనసాగింది. సుమారు గంటపాటు కొనసాగిన సీసీఎస్ సమావేశంలో ఆపరేషన్ సింధూర్‌పై, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధానికి వివరించారు. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్‌, అనంతర పరిణామాలపై కూడా చర్చించారు.

అటు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన రద్దు అయ్యింది. క్రొయేషియా, నార్వే నెదర్లాండ్స్ పర్యటన రద్దు చేసుకున్నారు ప్రధాని మోదీ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button