ఆంధ్ర ప్రదేశ్
Anitha: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం బాధకరం

Anitha: సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు మృతి చెందడం దురదృష్టకరమని హోంమంత్రి అనిత అన్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం బాధకరమన్నారు. సీఎం చంద్రబాబు ప్రతి నిమిషం మానిటారింగ్ చేస్తున్నారని అనిత తెలిపారు.
మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారంతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వటం జరుగుతుందని హోంమంత్రి అనిత తెలిపారు. వారి పిల్లలను చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని అనిత హామీ ఇచ్చారు. ప్రమాద కారణాలపై 3 కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు అనిత తెలిపారు.