తెలంగాణ
Raja Singh: టూరిస్టులపై దాడి చేయడం దారుణం

Raja Singh: పహల్గాంలో ఉగ్రదాడిని ఖండించారు ఎమ్మెల్యే రాజాసింగ్. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేశాకే ప్రశాంతంగా ఉందన్నారు ఆయన. కశ్మీర్ను కేంద్రం డెవలప్ చేసిందన్న రాజాసింగ్ పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు కశ్మీర్ను ప్రశాంతంగా ఉంచకుండా కుట్ర చేశారంటూ నిప్పులు చెరిగారు. టూరిస్టుల పేర్లు అడిగి మరీ దాడి చేయడం దారుణమన్నారు.
మోదీ ఆధ్వర్యంలో హైలెవల్ మీటింగ్ జరుగుతోందన్న రాజాసింగ్ దాడి చేసిన ఉగ్రవాదులను పట్టుకుని, చంపేవరకు మోదీ, అమిత్ షా వదలరని రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. ఇక కొందరు కశ్మీర్ స్థానికులు ఉగ్రవాదులకు సపోర్ట్ చేశామన్నారు రాజాసింగ్. ఇక హిందువులు అమర్నానాథ్, విష్ణుదేవ్ యాత్రకు వెళ్లాలని సూచించారు రాజాసింగ్.