ఆంధ్ర ప్రదేశ్

Raj Kasireddy: రాజ్ కసిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

Raj Kasireddy: మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత రాజ్ కసిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది. ఇవాళ ఈ కేసులో వాదనలు-ప్రతివాదనలు విననుంది ధర్మాసనం. లిక్కర్ కేసులో ముందస్తు బయిల్ కోరుతూ రాజ్ కసిరెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ జమానాలో రాజ్ కసిరెడ్డి వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో విచారణకు రావాలంటూ ఇప్పటికే రాజ్ కసిరెడ్డికి నాలుగు సార్లు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే విచారణకు రాజ్ కసిరెడ్డి హాజరుకాలేదు. ఇక ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నారు సిట్ అధికారులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button