జాతియం
Jammu Kashmir Floods: వరద బీభత్సం.. ముగ్గురు మృతి

Jammu Kashmir Floods: జమ్ముకశ్మీర్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా ముగ్గురు మృతి చెందారు. రాంబన్లో వరద బీభత్సం సృష్టించింది. అంతేకాదు శ్రీనగర్-జమ్ము హైవేపై కొండచరియలు విరిగిపడ్డాయి. వరదలతో పలు ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. ఇక పలు ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి.
మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అత్యవసరంగా వర ద పరిస్థితులపై కేంద్రమంత్రి జితేంద్రసింగ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అదేవిధంగా బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.