తెలంగాణ
Telangana: రేపు తెలంగాణలో కాంగ్రెస్ నిరసనలు, ధర్నా

Telangana: కేంద్ర ప్రభుత్వం తీరు ముఖ్యంగా ప్రధాని మోదీ వ్యవహారంపై కాంగ్రెస్ నిప్పులు చెరుగుతోంది. మోదీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జీషీట్లో చేర్చడాన్ని తెలంగాణ కాంగ్రెస్ తప్పుబడుతోంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ధర్నా, నిరసనలకు పిలుపునిచ్చింది తెలంగాణ పీసీసీ.
రేపు ఈడీ ఆఫీస్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాలని ఇందులో భాగంగా ఉదయం 10గంటల వరకు ఈడీ కార్యాలయానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలిరావాలని పిలుపునిచ్చింది.