ఆంధ్ర ప్రదేశ్
Talupulamma Jatara: తలుపులమ్మ అమ్మవారి గంధ అమావాస్య జాతర మహోత్సవాలు

Talupulamma Jatara: కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరు తలుపులమ్మ అమ్మవారి దివ్య క్షేత్రంలో గంధ అమావాస్య జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవస్థానం ఈవో విశ్వనాథరాజు ఆధ్వర్యంలో అమ్మవారి పుట్టింటి గ్రామమైన లోవకొత్తూరు నుంచి గరగలను తీసుకువెళ్లి కొండపై అమ్మవారి సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై గరగల సంబరాలు ఘనంగా నిర్వహించారు. నేటి నుంచి 27వ తేదీ వరకు అమ్మవారి గంధ అమావాస్య జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని ఈవో తెలిపారు.