తెలంగాణ
Hyderabad: భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

Hyderabad: భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన హైదరాబాద్ కూకట్పల్లిలో చోటుచేసుకుంది. సౌజన్య అనే మహిళ మంగళవార రాత్రి సూసైడ్ నోట్ రాసి ఇంట్లోని ఫ్యాన్కి ఉరివేసుకుంది.
తన భర్త, కుటుంబ సభ్యులు మానసికంగా వేధించారని లేఖలో పేర్కొంది. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతురాలు సౌజన్యకి 2020లో రజినీకాంత్ తో వివాహం అయింది. మూడేళ్ల బాబు కూడా ఉన్నాడు.