ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: పాస్టర్ ప్రవీణ్ మృతిపై స్పందించిన చంద్రబాబు

Chandrababu: పాస్టర్ ప్రవీణ్ మృతిపై సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రవీణ్ మృతిపై డీజీపీతో మాట్లాడారు ముఖ్యమంత్రి. పాస్టర్ మృతిపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పాస్టర్ ప్రవీణ్ మృతి ఆరోపణలపై హోంమంత్రి అనిత స్పందించారు.
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి ఆరా తీశారు హోంమంత్రి అనిత. పాస్టర్ మరణంపై సమగ్ర విచారణకు ఆదేశించారు అనిత. పాస్టర్ ప్రవీణ్ ప్రమాదానికి సంబంధించి మళ్లీ సీసీ ఫుటేజీలు పరిశీలించాలని అనిత ఆదేశాలు జారీ చేశారు.