పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై వీడిన మిస్టరీ

పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై మిస్టరీ వీడింది. రెండు సీసీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలించారు. కొంతమూరు వద్ద ప్రవీణ్ బైక్ బోల్తాకొట్టినట్లు గుర్తించారు. ఈ ఘటనలో పాస్టర్ పగడాల ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పగడాల ప్రవీణ్ రోడ్ యాక్సిడెంట్లో మృతి చెందాడని పోలీసులు నిర్ధారించారు.
బుల్లెట్పై విజయవాడ నుంచి రాజమండ్రికి పయనమయ్యాడు పాస్టర్ పగడాల ప్రవీణ్. అయితే హెల్మెట్ ధరించినా, ముఖంపై తీవ్రమైన గాయాలు ఉండటంతో అనుమానాలు వ్యక్త మయ్యాయి. దీంతో మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ నిన్న ఆస్పత్రి వద్ద పాస్టర్లు, మద్దతుదారులు ఆందోళనకు దిగారు.
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగించారు. ఈ నేపథ్యంలో సీసీ ఫుటేజ్ లభించడంతో పాస్టర్ మృతిపై అనుమానాలు వీడాయి. అలాగే రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు వెల్లడించారు.