TG 10th Exams: నల్గొండలో 10th పేపర్ లీక్.. ఆరుగురు అరెస్ట్

TG 10th Exams: పదో తరగతి తెలుగు పేపర్ లీక్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.పేపర్ లీక్ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. నల్గొండ జిల్లా నకిరేకల్లో టెన్త్ తెలుగు పేపర్ లీక్ కేసులో అధికారులు దర్యాప్తులో వేగం పెంచారు. 12 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల్లో డిబార్ అయిన విద్యార్థిని పేరును కూడా చేర్చారు. అదేవిధంగా ప్రశ్నపత్రం బయటికి రావడానికి ఓ విద్యార్థిని ఆరోపిస్తూ డిబార్ చేశారు. ఈ క్రమంలోనే డిబార్ అయిన విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి తాజాగా స్పందించారు.
పేపర్ లీక్పై తనకు ఏ పాపం తెలియదు. అని స్పష్టం చేశారు. ఆకతాయిలు వచ్చి కిటికీ దగ్గర ఎగ్జామ్ రాస్తున్న పేపర్ చూపించు లేదంటే రాయితో కొడతానంటూ బెదిరించి క్వశ్చన్ పేపర్ ఫోటో తీసుకున్నారని తెలిపారు. ఆ సమయంలో తనకు భయం వేసింది. ఏం చేయాలో అర్థం కాక పేపర్ చూపించానని చెప్పారు.
ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని, దయచేసి తన డిబార్ను రద్దు చేయాలని అధికారులను కోరారు. ఎవరో చేసిన దానికి నన్ను బలి చేశారు. దయచేసి పరీక్ష రాసే అవకాశం కల్పించాలని అధికారులను వేడుకున్నారు. ఎగ్జామ్ రాయనియ్యకపోతే నాకు చావే శరణ్యం అంటూ విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది.