ఆంధ్ర ప్రదేశ్
నెల్లూరు జిల్లాలో శ్రీ చైతన్య స్కూల్ బిల్డింగ్కు తాళం

Nellore: నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ హై స్కూల్కు బిల్డింగ్ యజమాని తాళం వేశాడు. గత రెండు సంవత్సరాలుగా అద్దె బకాయిలు చెల్లించనందువలన స్కూలుకు తాళం వేశారు. స్కూల్లో 500 మంది పైచిలుకు విద్యార్థులు ఉన్నారు. కాగా తమ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు.