తెలంగాణ
రంగారెడ్డి జిల్లా అన్నారం వై జంక్షన్ వద్ద అగ్నిప్రమాదం

Fire Accident: రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని అన్నారం వై జంక్షన్ వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. సందర్శిని ఉడిపి హోటల్ వెనుక ఉన్న వ్యర్థాల్లో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యర్థాలను వేసిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.