ఆంధ్ర ప్రదేశ్
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి ఏపీ హైకోర్టులో భారీ ఊరట

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. 35(3) కింద నోటీసులు ఇచ్చిన తర్వాతనే తదుపరి చర్యలు ఉండాలని సూచించింది.
విశాఖలో నమోదు అయిన కేసులో కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించాడు. చంద్రబాబు, నారా లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని విశాఖ త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఏయూ కాలేజీ విద్యార్థిని ఫిర్యాదు చేశారు.
ఇప్పటికే ఈ కేసులో కొడాలి నాని అనుచరులకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో అప్రమత్తమైన కొడాలి నాని ముందస్తుగా హైకోర్టును ఆశ్రయించారు. విశాఖలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం తొందరపాటు చర్యలు వద్దని పోలీసులను ఆదేశించింది.